తప్పిపోయిన బాలిక తల్లిదండ్రులకు అప్పగింత
సత్యసాయి: గాండ్లపెంట మండలానికి చెందిన 16 ఏళ్ల మైనర్ బాలిక కనిపించకుండా పోయిన కేసును అనంతపురం త్రీటౌన్ పోలీసులు గురువారం పరిష్కరించారు. బాలిక అనంతపురం ఆర్టీసీ బస్టాండ్లో ఒంటరిగా తిరుగుతుండగా పోలీసులు గుర్తించారు. ఆరా తీయగా, మిస్సింగ్ బాలిక అని తెలిసింది. వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి, బాలికను సురక్షితంగా వారికి అప్పగించారు.