బొల్లారం మీదుగా రాయలసీమ ఎక్స్ ప్రెస్.. టైమింగ్స్ ఇవే..!
HYD: రాయలసీమ ఎక్స్ప్రెస్ రైలుకు బొల్లారం స్టేషన్లో స్టాపేజ్ కల్పించారు. తిరుపతి నుంచి సాయంత్రం 5:35 బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5:40 సమయానికి సికింద్రాబాద్ చేరుకుంటుంది. బొల్లారం వచ్చేసరికి ఉదయం 6:15 అవుతుందని రైల్వే అధికారులు తెలిపారు. తిరుగు ప్రయాణంలో బొల్లారంలో సాయంత్రం 4:09 గంటలకు రైలు అందుబాటులో ఉంటుందని SCR అధికారులు తెలిపారు.