రైతులకు సాగునీరు విడుదల చేయాలని విన్నపం
SKLM: జిల్లాల్లో రబీ వరి పంటకు సాగునీరు అందక ఎండిపోతున్న పొలాలను పరిశీలించి, సాగునీరు విడుదల చేయాలని డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య డిప్యూటీ కలెక్టర్కు విన్నపం చేశారు. 300 ఎకరాల్లో వరి పంట ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న జిల్లాలో రైతులకు అధోగతి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.