పరకామణి కేసు.. మల్లికార్జునరావును విచారించిన CID
AP: టీటీడీ పరకామణి కేసులో సీఐడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ క్రమంలో పరకామణి డిప్యూటీ ఈవో మల్లికార్జునరావును సీఐడీ అధికారులు నాలుగు గంటలపాటు విచారించారు. చోరీ సమయంలో అదనపు బాధ్యతలు నిర్వహించినట్లు ఆయన వివరణ ఇచ్చారు. సీసీ ఫుటేజ్ అదృశ్యం, సమాచారంలీక్పై సీఐడీ అధికారులు ఆయనను ప్రశ్నలు అడిగారు.