కృష్ణా నదికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ
కృష్ణా: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఈ మేరకు అధికారులు ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బ్యారేజీకి ఇన్ ఫ్లో 5.67 లక్షల క్యూసెక్కులుగా ఉండటంతో నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అయితే, గతంలో ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద బోట్లు ఇరుక్కున్న విషయం విధితమే.