జాతీయస్థాయి టాపర్కు మంత్రి అభినందనలు
KMM: ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ప్రోగ్రామింగ్లో జాతీయ స్థాయి టాపర్గా నిలిచిన ఖమ్మం రూరల్ మండలం ఆరెంపులకు చెందిన తాల్లూరి పల్లవి ఇటీవల ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన క్యాంపు కార్యాలయంలో ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. పల్లవి విజయం ఇంకొందరు విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.