ఏజీపీగా సీతారామ ప్రసాద్ నియామకం

ఏజీపీగా సీతారామ ప్రసాద్ నియామకం

కృష్ణా: గుడివాడ జూనియర్ సివిల్ కోర్టు ఏజీపీగా సీనియర్ న్యాయవాది పిన్నింటి సీతారామ ప్రసాద్ శనివారం నియమితులయ్యారు. ఈ మేరకు ప్రసాద్‌ను ఏజీపీగా నియమిస్తూ న్యాయశాఖ కార్యదర్శి జీవో విడుదల చేశారు. గత 18 ఏళ్లుగా గుడివాడలో న్యాయవాది వృత్తిలో విశేష సేవలు అందించిన ప్రసాద్ ఏజీపీగా నియమించింది. బార్ అసోసియేషన్ నాయకులు, న్యాయవాదులు ఆయనకు అభినందనలు తెలిపారు.