భూములను రీసర్వే నిర్వహించిన ఆర్డీవో
NLR: ఆత్మకూరు మండలం పమిడిపాడులో జరుగుతున్న రీసర్వే ప్రక్రియను ఆత్మకూరు ఆర్డీవో బి.పావని బుధవారం పరిశీలించారు. రెవెన్యూ సిబ్బంది గ్రామంలోని 810 ఎకరాల భూముల హద్దులను నూతనంగా నమోదు చేసే ప్రక్రియను చేపట్టారు. ఇక్కడ జరుగుతున్న భూ రీసర్వే విధానాన్ని ఆర్డీఓ పరిశీలించి భూముల వివరాలు వాటి యజమానుల వివరాలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.