ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఈసీ కీలక ప్రకటన

ఉపరాష్ట్రపతి అభ్యర్థులను ఈసీ అధికారికంగా ప్రకటించింది. NDA అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, కాంగ్రెస్ అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్లను ఆమోదించినట్లు ఈసీ తెలిపింది. కాగా, సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల పోలింగ్ జరగనుండగా.. అదే రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఈసీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.