ఆలయ సమీపంలో మద్యం.. మేయర్కు ఫిర్యాదు
ఖమ్మంలోని స్తంభాద్రి నర్సింహస్వామి, కనకదుర్గ ఆలయాల సమీపంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారని ఆలయ ధర్మకర్త ఏపూరి దేవమణి మేయర్ నీరజకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ స్థలంలో మేకల పెంపకం వల్ల భక్తులు దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదానం కోసం కొంత స్థలం కేటాయించాలని కూడా కోరారు. దీనిపై స్పందించిన మేయర్, నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.