ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

అన్నమయ్య: మదనపల్లెలో సోమవారం జరిగిన ప్రజా దర్బార్‌లో స్థానిక ప్రజలు తమ సమస్యలను మదనపల్లి శాసనసభ్యులు యం. షాజహాన్ భాషకు వివరించి, పరిష్కారం కోరారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి, అధికారులతో మాట్లాడి పరిష్కరించగల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజల సమస్యలను సానుభూతితో ఆలకించి, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.