లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
VSP: సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు, ప్రభుత్వ విప్ గణబాబు కొత్తగా మంజూరైన పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. వితంతువులకు రూ.4,000, డయాలసిస్ రోగులకు రూ.10,000 పెంచిన పెన్షన్లను ఆయన పంపిణీ చేశారు. ఈ పెన్షన్లను 58వ వార్డులోని కారాడ వీధి నుంచి రామ్నగర్ వరకు ఇంటింటికి వెళ్లి అందజేశారు.