రెవెన్యూ క్లినిక్ ఏర్పాటుపై మంత్రి హర్షం
PPM: రాష్టంలో ఎక్కడా లేనివిధంగా రెవిన్యూ సమస్యల పరిష్కారం కొరకు ప్రత్యేకంగా రెవిన్యూ క్లినిక్ జిల్లాలో ఏర్పాటుచేయడం పట్ల రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో రెవెన్యూ క్లినిక్ ద్వారా అందిస్తున్న సేవలు మెరుగ్గా ఉన్నాయని మంత్రి కొనియాడారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.