రామ్కో పరిశ్రమపై రైతుల ఆగ్రహం
NDL: రామ్కో పరిశ్రమ వల్ల నష్టపోయిన రైతులు ధర్నా చేస్తామంటే అడ్డుకుంటామని టీడీపీ మండల అధ్యక్షుడు మూలె రామేశ్వరరెడ్డి వ్యాఖ్యానించడం సిగ్గుచేటని జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షుడు పుల్లయ్య విమర్శించారు. కొలిమిగుండ్లలో సీపీఐ, రైతు సంఘం ఆధ్వర్యంలో ఇవాళ సమావేశం నిర్వహించారు. మూలె రామేశ్వరరెడ్డి రైతుల పక్షమా?, పరిశ్రమ పక్షమా? స్పష్టంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.