'ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి'
GDWL: రాష్ట్రంలో దాదాపు 15 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి పెండింగ్లో ఉన్న రూ. 8,500 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య డిమాండ్ చేశారు. ప్రైవేట్ కళాశాలలు సోమవారం స్వచ్ఛందంగా బంద్ పాటించగా, బీఆర్ఎస్వీ వారికి మద్దతు ప్రకటించింది.