ఖరీఫ్ సీజన్పై అధికారులతో తుమ్మల సమీక్ష
TG: ఖరీఫ్ సీజన్పై అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ ఛైర్మన్ కోదండరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సన్న వరి రకాలు, విత్తన లభ్యత, సాగుప్రణాళికపై చర్చించారు. వరి ధాన్యం కొనే విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని మంత్రి సూచించారు.