యోగా పోటీల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ
NZB: రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారని యోగా అసోసియేషన్ కార్యదర్శి గంగాధర్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం వివరాలు వెల్లడించారు. ఈనెల 8,9 తేదీల్లో రంగారెడ్డిలోని ఓ స్కూల్లో 12వ రాష్ట్రస్థాయి యోగాసన పోటీలు జరిగాయని వివరించారు. జిల్లాకు చెందిన 8-10 బాలికల విభాగంలో ఆర్ రిషిత రెండవ స్థానంలో నిలిచిందన్నారు.