డ్వాక్రా బజారును ప్రారంభించిన ఎమ్మెల్యే
NTR: విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన డ్వాక్రా బజారును ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సంఘాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, స్వయం సహాయక సంఘాలు ఉత్పత్తులను మార్కెటింగ్ వేదికలను కల్పించడం ద్వారా వారి ఆదాయాలను పెంపొందించేందుకు తోడ్పడతాయని తెలిపారు.