తుళ్లూరులో ఆవుల దొంగ అరెస్టు

తుళ్లూరులో ఆవుల దొంగ అరెస్టు

GNTR: తుళ్లూరు మండలంలో 25కు పైగా ఆవులను అపహరించిన గుంటుపల్లి శ్రీకాంత్‌ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. విచారణ సమయంలో నిందితుడు పోలీస్ స్టేషన్ గోడ దూకి పరారవ్వడం కలకలం రేపింది. అయితే, అతని కుటుంబ సభ్యులే తిరిగి అతడిని పోలీసులకు అప్పగించడంతో కథ సుఖాంతమైంది. ఆవుల చోరీపై మండలంలోని పలువురు యజమానులు ఫిర్యాదు చేయడంతో ఈ గుట్టు రట్టయింది.