VIDEO: పోరంకిలో ప్రెస్ క్లబ్ ప్రారంభం

కృష్ణా: పెనమలూరు మండలం పోరంకిలో ప్రెస్ క్లబ్ను ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గురువారం ప్రారంభించారు. విలేకరులు ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు వారధిగా ఉంటారని, ప్రజా సమస్యలను వెలికితీయడంలో ఎల్లప్పుడూ ముందుంటారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు విలేకరులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.