నూతన రెవెన్యూ డివిజన్గా పీలేరు
CTR: కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ డివిజన్లలో భాగంగా చిత్తూరు జిల్లాలోని పీలేరును కూడా కొత్త రెవెన్యూ డివిజన్గా ఆమోదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజలకు పరిపాలనా సౌలభ్యాన్ని మెరుగుపరచడం, ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. పీలేరు రెవెన్యూ డివిజన్గా మారడంతో ఆ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.