YCP మళ్లీ అధికారంలోకి వస్తుంది: అంబటి

AP: రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. 'పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారు. నూజెండ్ల మండలం అన్నవరంలో ఎలక్షన్ జరగకూడదని మంత్రి లోకేష్ ఆలోచన. వెంకట ప్రసాద్ను చంపాలని ప్రయత్నించారు. క్రిమినల్స్కు పోలీసులు అండగా ఉన్నారు. రెడ్ బుక్ శాశ్వతంగా ఉండదు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుంది' అని అన్నారు.