సూపరింటెండెంట్ లీలా ప్రసాద్కు సత్కారం
కృష్ణా: మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి నూతనంగా నియమించబడిన సూపరింటెండెంట్ లీలా ప్రసాద్ను బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సుబ్రమణ్యం మంగళవారం పుష్పగుచ్చం అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం ఆస్పత్రిలో ఉన్న పలు సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలని సూపరింటెండెంట్ను కోరారు. సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.