రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్ మృతికి వైసీపీ నివాళి

రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్ మృతికి వైసీపీ నివాళి

ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీ 13వ వార్డుకు చెందిన విశ్రాంత ఆర్టీసీ కండక్టర్ సయ్యద్ తాహెర్ సోమవారం మరణించారు. విషయం తెలుసుకున్న వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ మృతదేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన అన్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.