నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి:  కలెక్టర్

GDL: ఈనెల 4వ తేదీన ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లాలో జరగనున్న నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని శనివారం కలెక్టర్ బీ.ఎం. సంతోష్ తెలిపారు. మ. 2 గంటల నుంచి సా. 5 గంటల వరకు జరగనున్న నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.