అక్రమ ఇసుక రవాణా.. ఇద్దరు రిమాండ్
SRCL: అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వ్యక్తిని రిమాండ్ చేసినట్టు బోయినపల్లి ఎస్సై రమాకాంత్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. బోయినపల్లి మండలం విలాసాగర్లో టిప్పర్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న డ్రైవర్ దూరసేటి శ్రీనివాస్, ఓనర్ అవుతారి రవీందర్ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించామన్నారు. అలాగే టిప్పర్ను సీజ్ చేసామన్నారు.