'ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి'
BHNG: ఆత్మకూరు(ఎం) మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వం పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి కొనుగోళ్లను వేగవంతం చేయాలని సీపీఎం మండల కార్యదర్శి వేముల భిక్షం అన్నారు. సోమవారం మండలంలోని తుక్కపురంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ధాన్యం కోనుగోళ్లలో నిర్లక్ష్య వైఖరి మానుకోవాలని హితవు పలికారు.