ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

W.G: తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా ఇంఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం ప్రారంభించారు. అనంతరం రైతులతో మాట్లాడి ప్రభుత్వ పంట కొనుగోలు విధానాలపై వివరాలు తెలియజేశారు. అలాగే రైతులకు అన్ని విధాల అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.