అశ్విని చంద్రశేఖర్కు సర్వేపల్లి రాధాకృష్ణన్ పురస్కారం
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందిన లయన్స్ క్లబ్ సభ్యులు, ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న అశ్విని చంద్రశేఖర్కు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పురస్కారం లభించింది. తెలంగాణ రాష్ట్ర భాషా సంస్కృతిక శాఖ, వావ్ మ్యూజిక్ యువతేజం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు సిటీ కల్చర్ హాల్లో ఇవాళ ప్రదానం చేశారు.