ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ర్యాలీ
ELR: ఉంగుటూరు మండల తల్లాపురం ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నల్లా నాగేంద్ర రావు ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను మంగళవారం ఎన్రోల్మెంట్ డ్రైవ్ ప్రారంభించారు. 5 సంవత్సరాల వయస్సు నిండిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను బోధన జరుగుతుందని ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి వివరించారు.