ఉయ్యూరు రైతు బజార్లో కూరగాయల ధరలు ఇవే.!
కృష్ణా: ఉయ్యూరు రైతు బజార్లో మంగళవారం అధికారులు కూరగాయల ధరలను ప్రకటించారు. పచ్చిమిర్చి కిలో రూ.43, కాకర రూ.46, వంగ రూ.20, ఉల్లి రూ.29, దొండకాయలు రూ.42, బెండకాయలు రూ.46గా ఉన్నాయి. అలాగే బంగాళాదుంప రూ.29, బీరకాయ రూ.44, టమాటా రూ.45, క్యారెట్ రూ.51, కాప్సికం రూ.66 ధరకు విక్రయమవుతున్నాయి. ఫ్రెంచ్ బీన్స్ కిలో రూ. 90గా ఉంది.