'ప్రజల వినతులు సకాలంలో పరిష్కరించాలి'

'ప్రజల వినతులు సకాలంలో పరిష్కరించాలి'

CTR: ప్రజల సమస్యలను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులు కట్టుబడి పనిచేయాలని సూచించారు. చిత్తూరు MLA గురజాల జగన్ మోహన్ ఆదేశాల మేరకు శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించి, సంబంధిత అధికారులతో అక్కడికక్కడే చర్చించారు. మొత్తం 23 వినతులు అందినట్లు అక్కడి సిబ్బంది తెలిపారు.