చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్
SKLM: లావేరు మండలానికి చెందిన పలువురు చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సర్టిఫికెట్లను ఎమ్మెల్యే ఈశ్వరరావు బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అండగా నిలవడానికి కట్టుబడి ఉందని తెలిపారు.