'లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి'

'లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి'

NRPT: నవంబర్ 15న జరిగే లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు కోరారు. లోక్ అదాలత్‌లో పరిష్కారమయ్యే కేసులపై కక్షిదారులతో మాట్లాడి రాజీ చేసేందుకు కృషి చేయాలని సూచించారు. ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని కోరారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.