బాధితులకు త్వరగా న్యాయం చేయాలి: ఎస్పీ

బాధితులకు త్వరగా న్యాయం చేయాలి: ఎస్పీ

సత్యసాయి: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆధ్వర్యంలో 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి 50 అర్జీలను ఆయన స్వీకరించారు. బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చట్ట పరిధిలో చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.