VIDEO: RTC బస్టాండ్లో ప్రయాణికుల అవస్థలు
అన్నమయ్య: రాజంపేటలో సరైన రవాణా సౌకర్యాలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం సాయంత్రం తిరుపతి వెళ్లేందుకు గంటల తరబడి వేచి ఉన్నా, ఇతర ప్రాంతాల బస్సులు నిండిపోయి రావడం వల్ల మహిళలు, వృద్ధులు కష్టాలపాలయ్యారు. అదనపు బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలని ఆర్టీసీ అధికారులకు ప్రజలు విజ్ఞప్తి చేశారు.