నారాయణి అలంకారంలో శ్రీ వీరుపాక్షి మారెమ్మ

కృష్ణా: పుంగనూరు ప్రైవేటు బస్టాండ్ సమీపంలోని మహిమాన్విత శక్తి స్వరూపిణి వీరుపాక్షి మారెమ్మ ఆలయంలో శనివారం సందర్బంగా అమ్మవారిని అర్చకులు ప్రత్యేకంగా నారాయణి అలంకారంలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అభిషేక పూజలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పూజ కార్యక్రమం అనంతరం ఆలయ కమిటీ వారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.