'కేజ్ వీల్తో ట్రాక్టర్ రోడ్డెక్కితే చట్టరీత్యా చర్యలు'

JN: కేజ్ వీల్తో ట్రాక్టర్ రోడ్డెక్కితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆదివారం ఓ ప్రకటన ద్వారా హెచ్చరించారు. డీసీపీ మాట్లాడుతూ.. కేజ్ వీల్తో ట్రాక్టర్లు రోడ్డు పై ప్రయాణిస్తుండడంతో రోడ్లు పాడవుతున్నాయని, ప్రజాధనం దుర్వినియోగానికి గురవుతుందన్నారు. కాబట్టి కేజ్ వీల్ వేసుకొని రోడ్లపైకి రావద్దని డీసీపీ హెచ్చరించారు.