వడదెబ్బ నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఆదోని: ఎండలు అధికమవుతున్న తరుణంలో వడదెబ్బ నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అన్నారు. శుక్రవారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఎండాకాలంలో వేడివల్ల చాలా మందిలో మైకం, భయం, వికారం వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయన్నారు. కావున ప్రజలు తగు జాగ్రతలు తీసుకోవాలని సూచించారు.