ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై
VKB: ధారూర్ ఎస్సై రాఘవేందర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంగళవారం సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ స్తంభాలు, తెగిన వైర్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. వాగులు, చెరువుల వద్ద జాగ్రత్తగా ఉండాలని కోరారు. నీళ్లలోకి దిగి సాహసాలు చేయవద్దని హెచ్చరించారు.