వేములూరిపాడులో పోలీసుల అవగాహన కార్యక్రమం
GNTR: ఫిరంగిపురం మండలం వేములూరిపాడు గ్రామంలో ఆదివారం ప్రజలకు అత్యవసర సేవల గురించి అవగాహన కల్పించారు. ఫిరంగిపురం పోలీసుల అధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యంగా డయల్ 100, 112 కాల్ సెంటర్ల వినియోగం గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి ఫిరంగిపురం సీఐ శివరామకృష్ణ, ఎస్సై సురేష్ హాజరై అత్యవసర సమయాల్లో పోలీసులు అందించే సేవలను వివరించారు.