గోదావరి అందాలు అద్భుతం :జయసుధ
E.G: ప్రముఖ సినీ నటి జయసుధ చాగల్లు, రామచంద్రపురంలో పర్యటించారు. అక్కడ జరిగిన క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యారు. ముందుగా రాజమండ్రిలోని మాజీ ఎంపీ హర్ష కుమార్ నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాజమండ్రిలోని గోదావరి అందాలు అద్భుతమని, అలాగే ఇక్కడ ప్రజలు అందించే ప్రేమ, ఆప్యాయతానురాగాలు తనకు ఎంతో ఇష్టమన్నారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు చెప్పారు.