దేశంలో దాడులకు కుట్ర..ఉగ్రముఠా అరెస్ట్
దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులకు కుట్ర పన్నిన ఉగ్రముఠాను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్తాన్ నిఘా సంస్థ ISIతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. లక్నో, గాజియాబాద్ తదితర ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించి పెద్ద ఎత్తున దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. విదేశాల నుంచి నిధులు పొందుతున్న ఓ సంస్థ వీరికి సహకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.