కలెక్టరేట్లో సంజీవయ్యకు ఘన నివాళి
CTR: దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 105వ జయంతి వేడుకలను చిత్తూరు కలెక్టరేట్లో శనివారం ఘనంగా నిర్వహించారు. DRO మోహన్ కుమార్, వివిధ శాఖల అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి సంజీవయ్యా అని కొనియాడారు.