బాప్స్ ఆలయంలో 15 ఏళ్ల యువకళాకారుడు కచేరీ

బాప్స్ ఆలయంలో 15 ఏళ్ల యువకళాకారుడు కచేరీ

అబుదాబీ బాప్స్ హిందూ ఆలయంలో 15 ఏళ్ల యువ యూఏఈ కళాకారుడు అహ్మద్‌ అల్‌ హషీమి పియానో కచేరీ చేశాడు. ఈ కార్యక్రమానికి 500 మంది అతిథులు పాల్గొన్నారు. వీరిలో యూఏఈ నాయకులు కూడా ఉన్నారు. ఈ పియానిస్ట్‌ ప్రదర్శనకు వారంతా ముగ్ధులయ్యారు. అతని మ్యూజిక్ తమ హృదయాలకు తాకిందని అతిథులు తెలిపారు. అతని మ్యూజిక్‌కు చెందిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.