'అందుకే నితీష్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టాం'

ఉప్పల్ వేదికగా DCతో జరుగుతున్న మ్యాచ్లో SRH మూడు మార్పులతో బరిలోకి దిగింది. తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి, షమీ, కామిందు మెండీస్లను తుది జట్టు నుంచి తప్పించింది. దీంతో నితీశ్ను పక్కనపెట్టడంపై SRH ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై SRH సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చింది. నితీశ్ అనారోగ్యానికి గురవ్వడంతోనే ఈ మ్యాచ్ ఆడటం లేదని స్పష్టం చేసింది.