దేశభక్తిని పెంచేందుకు యూనిటీ మార్చ్: ఎమ్మెల్యే
SKLM: పాతపట్నం మండల కేంద్రంలో యూనిటీ మార్చ్ కార్యక్రమం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు పాల్గొన్నారు. 'ఏక్ భారత్ శ్రేష్ట భారత్' అనే నినాదాలతో ర్యాలీ ఉత్సాహంగా సాగింది. యువతలో దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ర్యాలీని నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.