మొక్కజొన్న తోటలో చిరుత పులి పాదముద్రలు

ప్రకాశం: కంభం మండలంలోని నడింపల్లి, ఎల్కోట మధ్యలో ఉన్న పంట పొలాల్లో మంగళవారం చిరుతపులి పాద ముద్రలు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఔరంగబాద్ గ్రామానికి చెందిన రైతులు స్థానిక ఏనుగుకొండ సమీపంలో సాగు చేస్తున్న మొక్కజొన్న పంట వద్దకు వెళ్లిన సమయంలో వారికి పులి పాదముద్రలు కనిపించడంతో ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు.