పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం
KRNL: రేపటీ నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు ఎంఈవో ఉస్మాన్ భాష తెలిపారు. ఇవాళ సిబ్బందికి తగు సూచనలు చేశారు. పెద్దకడుబూరులో ఏపి మోడల్ స్కూల్, ZP పాఠశాల, KGBV పాఠశాలలను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం రెగ్యులర్ 610 మంది విద్యార్ధులు, సప్లిమెంటరీ 77 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారు.