పల్లెనిద్ర నిర్వహించిన డీఎస్పీ
ప్రకాశం: కనిగిరి మండలంలోని చిన్నఈర్లపాడులో గురువారం రాత్రి డీఎస్పీ సాయి యశ్వంత్ ఈశ్వర్, ఎస్సై శ్రీరామ్ పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఎస్సై మాట్లాడుతూ.. గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కొత్త వ్యక్తులు గ్రామంలో సంచరిస్తున్నట్లు అనుమానం ఉంటే వెంటనే ఆ సమాచారాన్ని పోలీసులకు తెలపాలన్నారు. దేవాలయాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకోవాలన్నారు.